రెండు నెలల తర్వాత ఏపీలో?

ఆంధ్రప్రదేశ్ లో ఆర్టీసీ బస్సులు ప్రారంభమయ్యాయి. ఈరోజు ఉదయం 7గంటల నుంచి బస్సు సర్వీసులను ప్రభుత్వం పునరుద్ధరించింది. దాదాపు 1683 బస్సులను నడుపుతున్నారు. రెడ్ జోన్ లు [more]

Update: 2020-05-21 02:32 GMT

ఆంధ్రప్రదేశ్ లో ఆర్టీసీ బస్సులు ప్రారంభమయ్యాయి. ఈరోజు ఉదయం 7గంటల నుంచి బస్సు సర్వీసులను ప్రభుత్వం పునరుద్ధరించింది. దాదాపు 1683 బస్సులను నడుపుతున్నారు. రెడ్ జోన్ లు మినహా అన్ని ప్రాంతాలకు బస్సు సర్వీసులను ప్రారంభించారు. ఏపీఎస్ ఆర్టీసీకి చెందిన 70 శాతం బస్సులు తిరుగుతున్నాయి. పూర్తి జాగ్రత్తలు తీసుకుంటూ బస్సులను నడుపుతున్నారు. ముందుగా ఆన్ లైన్ లో రిజర్వేషన్ చేసుకున్న వారినే అనుమతిస్తున్నారు. డిపోల్లోనూ రిజర్వేషన్ ఏర్పాట్లు చేశారు. దాదాపు రెండు నెలల తర్వాత ఏపీలో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి.ఆర్టీసీ ఛార్జీలను పెంచలేదని అధికారులు చెప్పారు.

Tags:    

Similar News