నేటి నుంచి ఏపీ తెలంగాణ మధ్య బస్సులు

దాదాపు నెలన్నర తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య ఆర్టీసీ బస్సు సర్వీసులు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి రెండు రాష్ట్రాలు బస్సులు నడపనున్నాయి. రెండు రాష్ట్రాల్లో కరోనా తీవ్రత [more]

Update: 2021-06-21 04:05 GMT

దాదాపు నెలన్నర తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య ఆర్టీసీ బస్సు సర్వీసులు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి రెండు రాష్ట్రాలు బస్సులు నడపనున్నాయి. రెండు రాష్ట్రాల్లో కరోనా తీవ్రత దృష్ట్యా లాక్ డౌన్ విధించడంతో ఆర్టీసీ సర్వీసులు నిలిచిపోయాయి. సరిహద్దుల్లో కూడా చెక్ పోస్టులు పెట్టి వాహనాల రాకపోకలను నిషేధించారు. అయతే కరోనా తీవ్రత తగ్గుతుండటంతో నేటి నుంచి ఏపీకి బస్సులు నడపాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. ఏపీలో కర్ఫ్యూ వేళల ప్రకారం బస్సులు నడపాలని నిర్ణయించింది. అలాగే ఏపీ కూడా తెలంగాణకు ఆర్టీసీ బస్సులను నేటి నుంచి నడుపుతుంది.

Tags:    

Similar News