నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

నల్గొండ జిల్లాలో నాగార్జున సాగర్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. దేవరకొండ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు, తుఫాన్ వాహనం ఢీకొట్టాయి. కొండమల్లేపల్లి మండలం [more]

Update: 2019-03-06 08:26 GMT

నల్గొండ జిల్లాలో నాగార్జున సాగర్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. దేవరకొండ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు, తుఫాన్ వాహనం ఢీకొట్టాయి. కొండమల్లేపల్లి మండలం దేవత్ పల్లి స్టేజీ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తుఫాన్ వాహనం నుజ్జనుజ్జయింది. ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.

Tags:    

Similar News