జగన్ వారిని ఏరిపారేయాలి

వైసీపీ రెబల్స్ ను జగన్ పక్కన పెట్టాలని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. జగన్ సునామీలో వైసీపీ రెబల్స్ కూడా కొట్టుకుపోయారన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఇక [more]

Update: 2021-03-15 00:56 GMT

వైసీపీ రెబల్స్ ను జగన్ పక్కన పెట్టాలని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. జగన్ సునామీలో వైసీపీ రెబల్స్ కూడా కొట్టుకుపోయారన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఇక మనవడితో శేష జీవితం గడిపితే బాగుంటుందని రోజా సూచించారు. టీడీపీని ప్రజలు ఇక పక్కన పెట్టేసినట్లేనని రోజా అన్నారు. తమ పార్టీలో రెబల్స్ ను ఏరిపారేయాలని రోజా అన్నారు. వారివల్ల పార్టీకి మంచి కంటే చెడు ఎక్కువగా జరిగే అవకాశం ఉందని రోజా అభిప్రాయపడ్డారు. పుత్తూరులో బహిరంగంగా తమ పార్టీ నేతలు రెబల్స్ గా పోటీ చేసినా ప్రజలు వారిని దూరం పెట్టారని రోజా అన్నారు.

Tags:    

Similar News