మంత్రి కేటీఆర్ కు రేవంత్ రెడ్డి లేఖ

తెలంగాణ మంత్రి కేటీఆర్ కు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి లేఖ రాశారు. బీజేపీ పై యుద్ధం ఎన్నికల వ్యూహంలో భాగమనేనని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. [more]

Update: 2021-03-08 01:23 GMT

తెలంగాణ మంత్రి కేటీఆర్ కు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి లేఖ రాశారు. బీజేపీ పై యుద్ధం ఎన్నికల వ్యూహంలో భాగమనేనని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గ్రేటర్ ఎన్నికల సందర్భంగా బీజేపీతో యుద్ధం చేస్తున్నట్లు ప్రకటించి, ఎన్నికలు పూర్తయిన వెంటనే ఢిల్లీకి వెళ్లి బీజేపీతో చేతులు కలిపి వచ్చారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో మరోసారి బీజేపీతో యుద్ధం చేస్తున్నట్లు నటించడం ఎందుకని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. టీఆర్ఎస్, బీజేపీల దోస్తీ ప్రజలకు తెలియంది కాదని ఆయన తన లేఖలో పేర్కొన్నారు.

Tags:    

Similar News