టికెట్ల కేటాయింపులో రేవంత్ కు షాక్..?

Update: 2018-11-09 09:39 GMT

కాంగ్రెస్ లో టిక్కెట్ల కేటాయింపు లొల్లి ముదురుతున్నట్లే కనపడుతోంది. టిక్కెట్ల కేటాయింపులో టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డి వర్గానికి పార్టీ షాక్ ఇచ్చిందని తెలుస్తోంది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరే సమయంలో ఆ పార్టీ నుంచి పలువురు నేతలు ఆయనతో పాటే కాంగ్రెస్ లో చేరారు. వీరికి టిక్కెట్లు ఇప్పించే బాధ్యత రేవంత్ తీసుకున్నారు. అయితే, 74 స్థానాలకు టిక్కెట్లు ఖాయం చేశామని నిన్న కుంతియా ప్రకటించారు. మరో 19 స్థానాలు పెండింగ్ లో పెట్టారు.

పెండింగ్ లో రేవంత్ వర్గం ఆశిస్తున్న స్థానాలు

రేవంత్ వర్గం ఆశిస్తున్న టిక్కెట్లనే ఎక్కువా పెండింగ్ లో పెట్టారని తెలుస్తోంది. రేవంత్ వర్గం నేతలు ఆశిస్తున్న వరంగల్ వెస్ట్, నిజామాబాద్ రూరల్, ఆర్మూరు, ఎల్లారెడ్డి, దేవరకొండ, ఇల్లందు, సూర్యాపేట, చెన్నూరు స్థానాలు పెండింగ్ లిస్టులో ఉన్నాయంటున్నారు. ఈ స్థానాల్లో తమ వర్గం నేతలకు కచ్చితంగా టిక్కెట్ ఇవ్వాలని రేవంత్ అధిష్ఠానాన్ని కోరుతున్నారు. వీరికి టిక్కెట్ ఇవ్వకపోతే తాను కూడా పోటీకి దూరంగా ఉంటానని ఆయన స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

Similar News