ప్రగతి భవన్ ను నేలమట్టం చేస్తాం

తెలంగాణ సమాజం ఒక కుటుంబం చేతిలో బందీ అయిందని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి అన్నారు. సరూర్ నగర్ లో జరిగిన సకలజనుల సమర భేరి సభలో [more]

Update: 2019-10-30 12:12 GMT

తెలంగాణ సమాజం ఒక కుటుంబం చేతిలో బందీ అయిందని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి అన్నారు. సరూర్ నగర్ లో జరిగిన సకలజనుల సమర భేరి సభలో ఆయన ప్రసంగించారు. కేసీఆర్ నియంత పాలనను అంతమొందించాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో సభలు జరుపుకోవడానికి కూడా కోర్టు నుంచి అనుమతి తీసుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. తెలంగాణ బిడ్డలు మరో పోరాటానికి సిద్ధం కావాలన్నారు రేవంత్ రెడ్డి. ఆర్టీసీ సమస్యల పరిష్కారంతో పాటు ప్రభుత్వంలో విలీనం చేయాల్సిందేనన్నారు. ప్రయివేటు బస్సులను మెగా కృష్ణారెడ్డికి అమ్ముకునేందుకే కేసీఆర్ ప్రభుత్వంలో విలీనం చేయడం లేదన్నారు. ఆర్టీసీ నడ్డి విరిగేలా కేసీఆర్ నిర్ణయాలు ఉన్నాయన్నారు. ఆర్టీసీ కార్మికులకు కాంగ్రెస్ అండగా ఉంటుందన్నారు. ప్రగతి భవన్ ను నేలమట్టం చేస్తామన్నారు.

Tags:    

Similar News