హైదరాబాద్ లో మరో గ్యాంగ్ రేప్

హైదరాబాద్ లో అత్యాచారం కలకలం సృష్టించింది. పట్టపగలే యువతిని కిడ్నాప్ చేసిన ఆటో డ్రైవర్లు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన పహాడి షరీఫ్ ఏరియాలో చోటు [more]

Update: 2021-08-19 02:22 GMT

హైదరాబాద్ లో అత్యాచారం కలకలం సృష్టించింది. పట్టపగలే యువతిని కిడ్నాప్ చేసిన ఆటో డ్రైవర్లు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన పహాడి షరీఫ్ ఏరియాలో చోటు చేసుకుంది. సంతోష్ నగర్ లో ఉండే మహిళ చాంద్రాయణగుట్ట లోని ఒక ల్యాబ్ లో టెక్నీషియన్ గా పని చేస్తుంటుంది. ప్రతినిత్యం మూడు గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వర్క్ చేస్తుంది. మధ్యాహ్నం సమయంలో సోదరుడు ల్యాబ్ దగ్గర వదిలిపెట్టి రాత్రి 10 గంటల సమయంలో తీసుకొని వెళ్ళి పోతాడు. అయితే ఎనిమిది గంటల ప్రాంతంలో యువతికి తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది. దీంతో తాను ఇంటికి బయలుదేరింది. చాంద్రాయణగుట్ట ప్రధాన రోడ్డు లోకి వచ్చి షేరింగ్ ఆటోలో యువతి ఎక్కింది. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత యువతికి నిద్రపట్టేసింది. దీనిని ఆసరాగా తీసుకొని డ్రైవర్ ఓవైపు తీసుకెళ్లి అత్యాచారం జరిపి వదిలిపెట్టి వెళ్లిపోయాడు. కాగా, బాధిత యువతి నేరుగా సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఆటో డ్రైవర్ల అఘాయిత్యంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న సౌత్ జోన్ పోలీసులు.. విచారణ చేస్తున్నారు. బాధితురాలిని భరోసా కేంద్రానికి తరలించి.. వివరాలు సేకరిస్తున్నారు. బాధితురాలు చెప్పిన వివరాల ఆధారంగా విచారణ మొదలు పెట్టారు. యువతి ఆటో ఎక్కినప్పటి నుంచి దిగే వరకు ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు పోలీసులు.

Tags:    

Similar News