ఈ షరతులు పెట్టడం న్యాయమా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు సీీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. పింఛన్లలో కోత పెట్టడాన్ని ఆయన అభ్యంతరం తెలిపారు. పింఛన్ల చెల్లింపుల్లో షరతులు [more]

Update: 2021-09-05 06:50 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు సీీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. పింఛన్లలో కోత పెట్టడాన్ని ఆయన అభ్యంతరం తెలిపారు. పింఛన్ల చెల్లింపుల్లో షరతులు విధించడమేంటని రామకృష్ణ ప్రశ్నించారు. రేషన్ కార్డుల్లో ఉన్న పేర్లలో ఒకరికి మాత్రమే పింఛను ఇస్తామనడమేంటని రామకృష్ణ నిలదీశారు. ప్రతి నెల ఖచ్చితంగా పెన్షన్ తీసుకోవాల్సిందేనని నిబంధన పెట్టడమూ అభ్యంతరకరమేనని అన్నారు. ఒక నెల పెన్షన్ తీసుకోకపోయినా ఆపేస్తామనడం విడ్డూరంగా ఉందని రామకృష‌్ణ అన్నారు.

Tags:    

Similar News