వైసీపీ ప్రభుత్వానికి రామకృష్ణ వార్నింగ్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. విద్యుత్తు ఛార్జీలను పెంచడంపై ఆయన అభ్యంతరం తెలిపారు. ఎన్నికల హామీల్లో విద్యుత్తు [more]

Update: 2021-09-02 03:49 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. విద్యుత్తు ఛార్జీలను పెంచడంపై ఆయన అభ్యంతరం తెలిపారు. ఎన్నికల హామీల్లో విద్యుత్తు ఛార్జీలు పెంచబోమని హామీ ఇచ్చిన విషయాన్ని రామకృష్ణ గుర్తు చేశారు. అయితే ఆ హామీని వైసీపీ ప్రభుత్వం విస్మరించిందని రామకృష్ణ తన లేఖలో పేర్కొన్నారు. 3,669 కోట్ల భారాన్ని ప్రజలపై మోపడం తగదని రామకృష్ణ హితవు పలికారు. కరోనా సమయంలో విద్యుత్తు ఛార్జీలను పెంచడం సరికాదని, నిర్ణయాన్ని మార్చుకోకుంటే ఉద్యమం తప్పదని రామకృష్ణ హెచ్చరించారు.

Tags:    

Similar News