రాజకీయాలు మానండి.. పోరాటానికి దిగండి

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణపై సీపీఐ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ మండి పడ్డారు. కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. కేంద్రం మొండిగా వెళితే చూస్తూ ఊరుకోబోమని [more]

Update: 2021-08-30 07:17 GMT

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణపై సీపీఐ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ మండి పడ్డారు. కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. కేంద్రం మొండిగా వెళితే చూస్తూ ఊరుకోబోమని రామకృష్ణ హెచ్చరించారు. వైసీపీ, టీడీపీ ఎంపీలు రాజకీయాలు పక్కన పెట్టి కేంద్ర ప్రభుత్వంపై పోరాటానికి దిగాలని రామకృష్ణ పిలుపు నిచ్చారు. గంగవరం పోర్టును అదానీకి అప్పగించడం అన్యాయమని అన్నారు. ఏపీ రాజధాని విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నాటకాలాడుతున్నాయని రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ అన్నారు.

Tags:    

Similar News