దానిని కర్నూలులోనే ఏర్పాటు చేయండి

కృష్ణా నది యాజమాన్యం బోర్డు కార్యాలయాన్ని కర్నూలులో ఏర్పాటు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ కార్యాలయాన్ని విశాఖకు తరలించాలని ప్రభుత్వం కోరడం [more]

Update: 2021-08-22 07:29 GMT

కృష్ణా నది యాజమాన్యం బోర్డు కార్యాలయాన్ని కర్నూలులో ఏర్పాటు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ కార్యాలయాన్ని విశాఖకు తరలించాలని ప్రభుత్వం కోరడం సమంజసం కాదన్నారు. కర్నూలులోనే కేఆర్ఎంబీ కార్యాలయన్ని ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన ప్రభుత్వం అభివృద్ధికి సమాధి కట్టిందని రామకృష‌్ణ అభిప్రాయపడ్డారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు చేయలేక రివార్డును ప్రకటించిందని రామకృష్ణ ఎద్దేవా చేశారు. పులివెందుల ఎమ్మెల్యే, కడప ఎంపీని విచారిస్తే నిజాలు బయటకు వస్తాయని రామకృష్ణ అభిప్రాయపడ్డారు.

Tags:    

Similar News