వారికి కూడా నష్ట పరిహారం ఇవ్వాల్సిందే

రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక చనిపోయిన వారికి మాత్రమే కాకుండా రాష్ట్రంలో ఆక్సిజన్ అందక చనిపోయిన వారందరికీ పరిహారం చెల్లించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ [more]

Update: 2021-05-13 00:39 GMT

రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక చనిపోయిన వారికి మాత్రమే కాకుండా రాష్ట్రంలో ఆక్సిజన్ అందక చనిపోయిన వారందరికీ పరిహారం చెల్లించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. రుయా ఆసుపత్రిలోనూ 31 మంది చనిపోతే కేవలం 11 మంది చనిపోయినట్లు ప్రభుత్వం చెబుతోందని రామకృష్ణ తెలిపారు. అనంతపురం, విజయనగరం, కర్నూలు, హిందూపురం, కదిరి, అమలాపురంలోనూ ఆక్సిజన్ అందక చనిపోయిన వారి కుటుంబాలకు పదిలక్షల నష్ట పరిహారం చెల్లించాలని, ఆక్సిజన్ అందక మరణించిన సంఘటనలపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరపాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.

Tags:    

Similar News