జ‌గ‌న్ ఏసీలో కూర్చుని ఏపీని మ‌రిచిపోయారు

లోట‌స్ పాండ్ లో ఏసీ గ‌దుల్లో కూర్చుంటున్న జ‌గ‌న్ ఏపీని మ‌రిచిపోయార‌ని, ఎన్నిక‌లు జ‌రిగిన నాటి నుంచి నేటి వ‌ర‌కు జ‌గ‌న్ ప్ర‌జ‌ల్లోకి రావ‌డ‌మే మానేశార‌ని తెలుగుదేశం [more]

Update: 2019-05-11 11:27 GMT

లోట‌స్ పాండ్ లో ఏసీ గ‌దుల్లో కూర్చుంటున్న జ‌గ‌న్ ఏపీని మ‌రిచిపోయార‌ని, ఎన్నిక‌లు జ‌రిగిన నాటి నుంచి నేటి వ‌ర‌కు జ‌గ‌న్ ప్ర‌జ‌ల్లోకి రావ‌డ‌మే మానేశార‌ని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్ర‌ప్ర‌సాద్ పేర్కొన్నారు. శ‌నివారం ఆయ‌న విజ‌య‌వాడ‌లో మీడియాతో మాట్లాడుతూ… త‌న పార్టీ ఓడిపోతుంద‌ని జ‌గన్ కు సైతం తెలిసిపోయింద‌ని అన్నారు. న‌రేంద్ర మోడీ, కేసీఆర్‌, జ‌గ‌న్ క‌లిసి చేసిన కుట్ర‌ల‌ను చంద్ర‌బాబు నాయుడు ఒంటిచేత్తో తిప్పికొట్టార‌ని కితాబిచ్చారు. మొన్న‌టి దాకా న‌రేంద్ర మోడీతో క‌లిసి కుట్ర‌లు చేసిన కేసీఆర్‌, జ‌గ‌న్ ఇప్పుడు కాంగ్రెస్ గెలుస్తుంద‌ని రాహుల్ గాంధీ జ‌పం చేస్తున్నార‌ని పేర్కొన్నారు. విజ‌య‌సాయిరెడ్డిపైనా రాజేంద్ర ప్ర‌సాద్ విమ‌ర్శ‌లు గుప్పించారు. విజ‌య‌సాయిరెడ్డి విష‌పుసాయిరెడ్డిలా మారిపోయార‌ని అన్నారు.

Tags:    

Similar News