3 గంటలు... 38 మంది నేతలు

Update: 2018-09-14 08:02 GMT

తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శుక్రవారం రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యనేతలతో సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి 38 మంది కాంగ్రెస్ నేతలు రాష్ట్రం నుంచి హాజరయ్యారు. సుమారు 3 గంటల పాటు అందరు నేతలతో రాహుల్ గాంధీ మాట్లాడారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతల అభిప్రాయాలను వినడంతో పాటు రాహుల్ కూడా పలు సూచనలు చేశారు. అయితే, ఈ సమావేశంలో పొత్తులు, సీట్ల ఖరారుపై చర్చ జరగలేదు. కేవలం ఎన్నికల్లో ఎటువంటి వ్యూహాలను అనుసరించాలి అనే విషయంపైనే ప్రధానంగా చర్చ జరిగింది.

Similar News