ఆయన రాజ్యాంగేతర శక్తి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వైసీపీ రెబల్ పార్లమెంటు సభ్యుడు రఘురామ కృష్ణరాజు ఈరోజు మరో లేఖ రాశారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి [more]

Update: 2021-07-06 13:01 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వైసీపీ రెబల్ పార్లమెంటు సభ్యుడు రఘురామ కృష్ణరాజు ఈరోజు మరో లేఖ రాశారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి పాత్ర, బాధ్యతలపై స్పష్టత ఇవ్వాలని రఘురామ కృష్ణరాజు ప్రశ్నించారు. ప్రభుత్వ సలహాదారు బాధ్యతలు ఏంటో సజ్జలకు తెలియదని రఘురామ కృష్ణరాజు అన్నారు. ప్రభుత్వ సలహాదారు సీఎంకు సలహాలు ఇవ్వాలే తప్ప, మంత్రులకు బదులు ప్రెస్ మీట్ లు పెట్టడం సరికాదని అన్నారు.

Tags:    

Similar News