మీ ఇద్దరి మధ్య అవగాహన ఎప్పుడో అర్థమయింది

హైదరాబాద్ లో సెటిలర్లు సంతోషంగా ఉన్నారని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. నీటివివాదాన్ని రాజకీయ అవసరాల కోసమే తెచ్చారని ఆయన అభిప్రాయపడ్డారు. చర్చల ద్వారా [more]

Update: 2021-07-03 01:47 GMT

హైదరాబాద్ లో సెటిలర్లు సంతోషంగా ఉన్నారని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. నీటివివాదాన్ని రాజకీయ అవసరాల కోసమే తెచ్చారని ఆయన అభిప్రాయపడ్డారు. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవచ్చని, కానీ ఈ జగడం రాజకీయ అవసరాల కోసమేనని ప్రజలు కూడా భావిస్తున్నారని రఘురామ కృష్ణరాజు అన్నారు. రెండు ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలున్నాయని, మేనెల 14వ తేదీన తన అరెస్ట్ సందర్భంగా ఈ విషయం స్పష్టమయిందని రఘురామ కృష్ణరాజు తెలిపారు. ప్రజలను మభ్యపెట్టే పనిని మానుకుని, అభివృద్ధి వైపు పయనించాలని ఆయన జగన్ కు సూచించారు.

Tags:    

Similar News