రాజధానిపై రఘురామ జగన్ కు..?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఈరోజు మరో లేఖ రాశారు. అమరావతి రాజధాని నిర్మాణం నిలిపేయడంపై ఆయన అభ్యంతరం [more]

Update: 2021-06-20 05:26 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఈరోజు మరో లేఖ రాశారు. అమరావతి రాజధాని నిర్మాణం నిలిపేయడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒకే రాజధాని, ఒకే రాష్ట్రం ఉండాలని రఘురామ కృష్ణంరాజు స్పష్టం చేశారు. రాజధానిగా అమరావతిని కొనసాగిస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆయన లేఖలో రాశారు. ప్రస్తుతం రాష్ట్రం ఆర్థికంగా నష్టాల్లో ఉందని, ఈ పరిస్థితుల్లో మూడు రాజధానులు అవసరమా? అని రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు. మూడు రాజధానుల వల్ల జరిగేదేమీ ఉండదని రఘురామ కృష్ణంరాజు అభిప్రాయపడ్డారు. నిస్వార్ధంగా రాజధాని కోసం భూములిచ్చిన రైతుల ఆవేదనను అర్ధం చేసుకోవాలని రఘురామ కృష్ణంరాజు కోరారు.

Tags:    

Similar News