జగన్ కు రాజుగారి ఆరో రోజు లేఖ

వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఆరోరోజు కూడా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు లేఖ రాశారు. ఉద్యోగుల డీఎ పెంపును అమలు చేయాలని కోరారు. రఘురామ [more]

Update: 2021-06-15 04:30 GMT

వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఆరోరోజు కూడా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు లేఖ రాశారు. ఉద్యోగుల డీఎ పెంపును అమలు చేయాలని కోరారు. రఘురామ కృష్ణంరాజు ఆరు రోజుల నుంచి హామీలను అమలుపర్చాలంటూ జగన్ కు లేఖలు రాస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఉద్యోగులకు డీఏ బకాయీలు చెల్లిస్తామని జగన్ హామీ ఇచ్చారని, అయితే ఇంతవరకూ దానిని అమలు చేయలేదని రఘురామ కృష్ణంరాజు లేఖలో తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులను కూడా ప్రభుత్వోద్యోగులుగా గుర్తించారని, దీనివల్ల పీఆర్సీ నివేదిక మరింత ఆలస్యమవుతుందన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల డీఏను వెంటనే పెంచి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని రఘురామ కృష్ణంరాజు తన లేఖలో కోరారు.

Tags:    

Similar News