టీవీ 5, ఏబీఎన్ పై కూడా కేసు నమోదు

వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు సహకరించారని టీవీ 5, ఏబీఎన్ లపై కూడా ఏపీ సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. సామాజికవర్గాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తేలా రఘు [more]

Update: 2021-05-15 06:20 GMT

వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు సహకరించారని టీవీ 5, ఏబీఎన్ లపై కూడా ఏపీ సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. సామాజికవర్గాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తేలా రఘు రామకృష్ణంరాజు తో కలసి ఏబీఎన్, టీవీ5లు పనిచేశాయని భావించి వారిపై కేసు నమోదు చేసింది. ఏ 1గా రఘురామకృష్ణంరాజు, ఏ 2గా టీవీ 5, ఏ3 గా ఏబీన్ ఛానల్స్ పై ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. ప్రభుత్వంపై విద్వేషాలను రెచ్చగొట్టేలా వీరు వ్యవహరించారని ఎఫ్ ఐఆర్ లో పేర్కొంది. ఈ రెండు ఛానళ్లతో కలసి రఘురామ కృష్ణంరాజు కుట్ర చేశారని సీఐడీ అధికారులు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు.

Tags:    

Similar News