పురంద్రీశ్వరికి కీలక బాధ్యతలు

బీజేపీలో పురంద్రీశ్వరి, డీకే అరుణలకు పార్టీ కేంద్ర నాయకత్వం కీలక బాధ్యతలను అప్పగించింది. పురంద్రీశ్వరిని ఛత్తీస్ ఘడ్, ఒడిశా ఇన్ ఛార్జిగా నియమించారు. డీకే అరుణను కర్ణాటక [more]

Update: 2020-11-14 02:56 GMT

బీజేపీలో పురంద్రీశ్వరి, డీకే అరుణలకు పార్టీ కేంద్ర నాయకత్వం కీలక బాధ్యతలను అప్పగించింది. పురంద్రీశ్వరిని ఛత్తీస్ ఘడ్, ఒడిశా ఇన్ ఛార్జిగా నియమించారు. డీకే అరుణను కర్ణాటక కో ఇన్ ఛార్జిగా నియమించారు. ఏపీ ఇన్ ఛార్జిగా మురళీధరరావు, కో ఇన్ ఛార్జిగా సునీల్ దేవధర్ వ్యవహరిస్తారు. తమిళనాడు కో ఇన్ ఛార్జిగా పొంగులేటి సుధాకర్ రెడ్డికి బాధ్యతలను అప్పగించారు. ఉత్తర్ ప్రదేశ్ కో ఇన్ ఛార్జిగా సత్యకుమార్ ను నియమించారు. తెలంగాణ బీజేపీ ఇన్ ఛార్జిగా తరుణ్ చుగా కు బాధ్యతలను అప్పగిస్తూ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదేశాలు జారీ చేశారు.

Tags:    

Similar News