Purandhreswari : ఫేక్ పోస్ట్ షేర్ చేసి…?

కేంద్ర మాజీ పురంద్రేశ్వరి ఫేక్ పోస్టును షేర్ చేసి నవ్వుల పాలయ్యారు. పురంద్రేశ్వరి షేర్ చేసిన పోస్టుపై సోషల్ మీడియాలో నెటిజన్లు అభ్యంతరం తెలుపుతున్నారు. వైఎస్ జగన్ [more]

Update: 2021-10-06 02:56 GMT

కేంద్ర మాజీ పురంద్రేశ్వరి ఫేక్ పోస్టును షేర్ చేసి నవ్వుల పాలయ్యారు. పురంద్రేశ్వరి షేర్ చేసిన పోస్టుపై సోషల్ మీడియాలో నెటిజన్లు అభ్యంతరం తెలుపుతున్నారు. వైఎస్ జగన్ ఫొటో నుంచి బూడిద రాలుతున్న ఫొటో ఇటీవల సోషల్ మీడియలో వైరల్ అయింది. ఒక ఆటో వెనక తగిలించి ఉన్న జగన్ ఫొటో నుంచి విభూది రాలుతుందని సోషల్ మీడియాలో ఫేక్ పోస్టు ఒకటి క్రియేట్ అయింది. అయితే దీనిని పురంద్రేశ్వరి తన ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేయడం, వైసీపీ అధికారంలోకి వచ్చాక బూడిదే మిగిలింది అన్న వ్యాఖ్యను జోడించడంతో నెటిజన్లు ఫేక్ పోస్టు షేర్ చేయడంపై సెటైర్లు వేస్తున్నారు.

Tags:    

Similar News