బ్రేకింగ్ : చాలా రోజుల తర్వాత భారత్ లో కరోనా

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి బాగా తగ్గుముఖం పట్టింది. తాజాగా భారత్ లో 36,469 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 488 మంది కరోనా కారణంగా [more]

Update: 2020-10-27 04:33 GMT

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి బాగా తగ్గుముఖం పట్టింది. తాజాగా భారత్ లో 36,469 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 488 మంది కరోనా కారణంగా మరణించారు. మూడు నెలల తర్వాత నలభై వేలకు తక్కువగా కేసులు నమోదయ్యాయి. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 79,46,429 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో 1,19,502 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో 6,25,857 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 72,01,070మంది డిశ్చార్జ్ అయ్యారు. . ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

Tags:    

Similar News