లాక్ డౌన్ ను ఎత్తివేసినా?

ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రులతో జరిపిన వీడియో కాన్ఫరెన్స్ రెండున్నర గంటల పాటు సాగింది. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో మొత్తం 9 రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. [more]

Update: 2020-04-27 07:48 GMT

ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రులతో జరిపిన వీడియో కాన్ఫరెన్స్ రెండున్నర గంటల పాటు సాగింది. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో మొత్తం 9 రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. ఏడగురు ముఖ్యమంత్రులు లాక్ డౌన్ ఎత్తివేయాలని ప్రధానిని కోరగా, ఇద్దరు ముఖ్యమంత్రులు మాత్రం లాక్ డౌన్ ను మరికొంతకాలం కొనసాగించాలన్న అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలిసింది. లాక్ డౌన్ ను ఎత్తివేసినా నిబంధనలను, ఆంక్షలను కొనసాగించాలని కొందరు కోరినట్లు సమాచారం. లాక్ డౌన్ కారణంగా దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరగడం లేదని మోదీ అభిప్రాయపడ్డారు. వలస కూలీల విషయాన్ని కూడా మోదీ ఈ సమావేశంలో ప్రస్తావించారు. కొందరు ముఖ్యమంత్రులు ఆర్థిక ప్యాకేజీ విషయాన్ని కూడా లేవనెత్తినట్లు తెలుస్తోంది. మోదీ లాక్ డౌన్ పై నిర్ణయాన్ని ఈ నెల 3వ తేదీన ప్రకటించే అవకాశముందంటున్నారు.

Tags:    

Similar News