Revanth reddy : ఓటమితో నాలో మరింత కసి పెరిగింది

హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాలపై పీసీీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. అక్కడ ఓటమికి తాను బాధ్యత వహిస్తానని రేవంత్ రెడ్డి చెప్పారు. అయితే ఓటమితో తనకు [more]

Update: 2021-11-02 12:18 GMT

హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాలపై పీసీీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. అక్కడ ఓటమికి తాను బాధ్యత వహిస్తానని రేవంత్ రెడ్డి చెప్పారు. అయితే ఓటమితో తనకు కసి మరింత పెరిగిందని చెప్పారు. ఆలస్యంగా తాము అభ్యర్థిని ప్రకటించినా వెంకట్ ప్రచారంలో దూసుకుపోయారన్నారు. క్యాడర్ ధైర్యంగా ఉండాలని రేవంత్ రెడ్డి పిలుపు నిచ్చారు. ఓటమి గెలుపునకు దారులు చూపుతుందని రేవంత్ రెడ్డి తెలిపారు. గులాబీ చీడను రాష్ట్రానికి వదిలేంచేందుకు రేపలి నుంచే ప్రజల్లోకి వెళతానని రేవంత్ రెడ్డి చెప్పారు. హుజురాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మూడు వేల ఓట్లు కూడా రాలేదు.

Tags:    

Similar News