ఈ లెక్కలు నాకు సంతోషాన్నిచ్చాయి

పంచాయతీ ఎన్నికల్లో జనసేన పార్టీ గణనీయమైన ఓటింగ్ శాతాన్ని సాధించినట్లు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో 23 శాతం [more]

Update: 2021-02-19 01:43 GMT

పంచాయతీ ఎన్నికల్లో జనసేన పార్టీ గణనీయమైన ఓటింగ్ శాతాన్ని సాధించినట్లు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో 23 శాతం ఓట్లు వచ్చాయని పవన్ కల్యాణ్ తెలిపారు. మూడో విడతలో 2,639 పంచాయతీ లకు ఎన్నికలు జరగ్గా 270కిపైగా పంచాయతీలను జనసేన కైవసం చేసుకుందని పవన్ కల్యాణ్ తెలిపారు. 1654 పంచాయతీల్లో జనసేన రెండో స్థానంలో నిలిచిందన్నారు. ఈ లెక్కలు తనకు ఎంతో సంతోషాన్నిచ్చాయని పవన్ కల్యాణ్ తెలిపారు. వైసీపీ నేతలు బెదిరించినా ధైర్యంతో నిలబడిన జనసైనికులను పవన్ కల్యాణ్ అభినందించారు.

Tags:    

Similar News