మూడు రాజధానులపై పవన్ కీలక సమావేశం

పవన్ కల్యాణ్ నేడు పార్టీ నేతలతో భేటీ కానున్నారు. మూడు రాజధానుల అంశంపై పార్టీ సీనియర్ నేతలతో పాటు మూడు ప్రాంతాల నేతల అభిప్రాయాలను తీసుకోనున్నారు. మూడు [more]

Update: 2020-08-02 02:24 GMT

పవన్ కల్యాణ్ నేడు పార్టీ నేతలతో భేటీ కానున్నారు. మూడు రాజధానుల అంశంపై పార్టీ సీనియర్ నేతలతో పాటు మూడు ప్రాంతాల నేతల అభిప్రాయాలను తీసుకోనున్నారు. మూడు రాజధానుల బిల్లును గవర్నర్ ఆమోదించడంతో ప్రభుత్వం విశాఖకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తుంది. అయితే తొలి నుంచి మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్న పవన్ కల్యాణ్ నేడు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీతో సమావేశం కానున్నారు. టెలికాన్ఫరెన్స్ ద్వారా నేతల అభిప్రాయాలను తీసుకుని, పవన్ కల్యాణ్ భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నారు.

Tags:    

Similar News