అలా చేస్తే ఊరుకోను.... పవన్ వార్నింగ్

Update: 2018-06-21 05:48 GMT

ఇకపై రాజధాని అమరావతిలో భూముల జోలికి వస్తే తాను ఊరుకోబోనని జనసేన అధినేత పవన్ కల్యాణ్ హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వమే భూకబ్జాదారులకు అండగా నిలబడటం విడ్డూరంగా ఉందన్నారు. అలాగే అమరావతిలో ఇకపై భూసేకరణ చట్టాన్ని అమలుచేయడానికి ప్రయత్నించారంటే తాను పోరాటానికి దిగి బాధితులకు అండగా నిలబడతానన్నారు. ఈ నెల 23న విజయవాడ రానున్న పవన్ కల్యాణ్ రాజధాని ప్రాంత రైతులతో సమావేశం కానున్నారు. అలాగే నాయీబ్రాహ్మణులపై ప్రభుత్వం వ్యవహరించిన తీరు సరిగా లేదన్నారు. టీటీడీ ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితుల ఆరపణలపై నిజాలను నిగ్గుతేల్చాలని పవన్ కల్యాణ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.

Similar News