Pattabhi : పట్టాభి కోసం పోలీసులు మళ్లీ వేట?

తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి బెయిల్ పై జైలు నుంచి విడుదలయ్యాక అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయనను పోలీసులు మరోసారి అదుపులోకి తీసుకుంటారని భావించి పట్టాభి [more]

Update: 2021-10-25 05:57 GMT

తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి బెయిల్ పై జైలు నుంచి విడుదలయ్యాక అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయనను పోలీసులు మరోసారి అదుపులోకి తీసుకుంటారని భావించి పట్టాభి బయటకు రావడం లేదు. ముఖ్యమంత్రి జగన్ ను దూషించిన కేసులో పట్టాభిని పోలీసులు అరెస్ట్ చేయగా, రాజమండ్రి జైలు నుంచి ఆయన విడుదలయ్యారు. జైలు నుంచి విడుదలయిన పట్టాభిని విజయనగరం పోలీసులు అరెస్ట్ చేస్తారని భావించి ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు. విజయనగరం జిల్లాలో పట్టాభి పై కేసు నమోదయింది. పట్టాభి కోసం పోలీసులు వెదుకుతున్నారని టీడీపీ నేతలు చెబుతుండగా, తాము పట్టాభిని అరెస్ట్ చేసే ఉద్దేశ్యం లేదని పోలీసులు చెబుతున్నారు.

Tags:    

Similar News