Pattabhi : వెనకడుగువేసే ప్రసక్తి లేదు.. భయపడేదే లేదు

వైసీపీ నేతలకు భయపడే ప్రసక్తి లేదని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ తెలిపారు. ఆయన పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తాను రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న [more]

Update: 2021-11-08 04:53 GMT

వైసీపీ నేతలకు భయపడే ప్రసక్తి లేదని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ తెలిపారు. ఆయన పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తాను రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అవినీతి, అరాచకాలపై ఎండగడుతూనే ఉంటానన్నారు. ఆధారాలతో సహా బయటపెడతానని పట్టాభి వైసీపీ నేతలను హెచ్చరించారు. నిజాలు మాట్లాడుతున్నాను కాబట్టే తనపై మూడు సార్లు దాడులు జరిగాయని పట్టాభి తెలిపారు.

ఎవరు ఏ తప్పు చేసినా….?

ఎక్కడ ఏ నాయకుడు తప్పు చేసినా తాను నిలదీస్తానని పట్టాభి తెలిపారు. తాను నిజాయితీ గల ఒక అధినేత నేతృత్వంలో పనిచేస్తున్నానని తెలిపారు. తాను పసుపు సైనికుడినని, భయపడే ప్రసక్తి లేదని పట్టాభి చెప్పారు. నిజాల్ని నిర్భయంగా మాట్లాడటంలో తాను ఎప్పుడూ ముందుంటానని చెప్పారు. ఎత్తిన పసుపు జెండాను దించే ప్రసక్తి లేదని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం పట్ల తన వైఖరిలో ఎటువంటి మార్పు ఉండదని చెప్పారు. పెట్రోలు, డీజిల్ ధరలపై ప్రభుత్వం అబద్దం చెబుతుందన్నారు.

Tags:    

Similar News