pattabhi : పట్టాభి వెళ్లింది అక్కడికే

టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి సేఫ్ గానే ఉన్నారు. ఆయన మాల్దీవులకు వెళ్లినట్లు తెలుస్తోంది. విమానంలో పట్టాభి ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. [more]

Update: 2021-10-25 12:43 GMT

టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి సేఫ్ గానే ఉన్నారు. ఆయన మాల్దీవులకు వెళ్లినట్లు తెలుస్తోంది. విమానంలో పట్టాభి ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్ ను దూషించిన కేసులో పట్టాభిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు. కానీ అప్పటి నుంచి ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు. మళ్లీ పోలీసులు అరెస్ట్ చేస్తారన్న భయంతోనే పట్టాభి పోలీసులకు కన్పించకుండా పోయారని టీడీపీ నేతలు అంటున్నారు.

మాల్దీవులకేనా?

కానీ పట్టాభి విజయవాడ నుంచి నేరుగా హైదరాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి బయలుదేరి గో ఇండియా ఎయిర్ లైన్స్ లో మాల్దీవులకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఆయన కొంత మానసిక ప్రశాంతత కోసం అక్కడకు వెళ్లినట్లు చెబుతున్నారు. విమానాశ్రయంలో, విమానంలో పట్టాభి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పట్టాభి తన కుటుంబ సభ్యులతో కలసి వెళ్లినట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News