కేసులకు భయపడేది లేదు

అధికార వైసీపీ పెడుతున్న కేసులకు తాము భయపడబోమని టీడీపీ నేత పరిటాల శ్రీరాం అన్నారు. ఎదురు తిరిగే రోజులొచ్చాయన్నారు. టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా పార్టీ కార్యాలయంలో [more]

Update: 2021-03-29 06:30 GMT

అధికార వైసీపీ పెడుతున్న కేసులకు తాము భయపడబోమని టీడీపీ నేత పరిటాల శ్రీరాం అన్నారు. ఎదురు తిరిగే రోజులొచ్చాయన్నారు. టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పరిటాల శ్రీరాం మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమ కేసులు పెడుతున్నారన్నారు. అయినా వీటికి ఎవరూ భయపడబోమని చెప్పారు. వాలంటీర్లను అడ్డం పెట్టుకుని ఇటీవల ఎన్నికల్లో గెలిచిన వైసీపీకి వచ్చే ఎన్నికల్లో గుణపాఠం చెబుతామని పరిటాల శ్రీరాం హెచ్చరించారు.

Tags:    

Similar News