వచ్చేశారు…. జర జాగ్రత్త

దేశ రాజధానిలో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందనే నిఘా వర్గాల హెచ్చరికలతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. పాక్ కు చెందిన నలుగురు జైషే మహ్మద్ సంస్థకు చెందిన [more]

Update: 2019-10-03 10:22 GMT

దేశ రాజధానిలో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందనే నిఘా వర్గాల హెచ్చరికలతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. పాక్ కు చెందిన నలుగురు జైషే మహ్మద్ సంస్థకు చెందిన ఉగ్రవాదులు చొరబడినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. ఈ నలుగురు కూడా భారీ ఆయుధాలతో ప్రవేశించినట్లు తెలిపాయి. రద్దీ ఉండే ప్రాంతాల్లో దాడులకు పాల్పడే అవకాశం ఉందని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. ఉగ్రవాదుల చొరబాటు నేపథ్యంలో ఢిల్లీ వ్యాప్తంగా పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఆర్టికల్ 370 రద్దుకు నిరసనగా దేశంలో ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉందని ఇటీవలే నిఘా వర్గాలు హెచ్చరించిన విషయం తెలిసిందే. ఇటీవల కశ్మీర్ లో సైతం ముగ్గురు టెర్రరిస్టులను భారతసైన్యం మట్టుబెట్టింది.

 

Tags:    

Similar News