Cricket : మ్యాచ్ కోసం… తట్టుకునేదెలా?

రోమాలు నిక్కబొడుచుకుంటాయి. బీపీ మిషన్లు బద్దలయిపోతాయి. కూర్చోబుద్ధి కాదు. నిల్చోబుద్ధి కాదు. ఫలితం తేలే వరకూ గుక్కెడు నీళ్లు కూడా మింగ బుద్ధి కాదు. ఇదీ ఈరోజు [more]

Update: 2021-10-24 02:45 GMT

రోమాలు నిక్కబొడుచుకుంటాయి. బీపీ మిషన్లు బద్దలయిపోతాయి. కూర్చోబుద్ధి కాదు. నిల్చోబుద్ధి కాదు. ఫలితం తేలే వరకూ గుక్కెడు నీళ్లు కూడా మింగ బుద్ధి కాదు. ఇదీ ఈరోజు భారత్ లో క్రికెట్ అభిమానుల పరిస్థితి. పాకిస్థాన్, ఇండియా టీ 20 మ్యాచ్ కు అంతా సిద్దమయింది. దుబాయ్ లో ఈరోజు రాత్రి 73.0 గంటలకు ప్రారంభయ్యే ఈ మ్యాచ్ కోసం అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

ఫేవరెట్ ఇండియా…

ప్రపంచ కప్ మ్యాచ్ లలో ఇప్పటివరకూ భారత్ – పాక్ ల మధ్య ఐదు మ్యాచ్ లు జరిగాయి. ఐదింటిలో భారత్ దే విజయం అయింది. మరో వైపు భారత్ మానసికంగా స్ట్రాంగ్ గా ఉంది. మెంటర్ గా థోని ఉన్నారు. ఆటగాళ్లంతా ఈ మ్యాచ్ లో తమ సత్తా చాటేందుకు సిద్ధమయి ఉన్నారు. ఈరోజు క్రికెట్ అభిమానులకు పండగే. సుదీర్ఘ కాలం తర్వాత జరుగుతున్న పాక్ – భారత్ మ్యాచ్ కోసం ఆసక్తిా ఎదురు చూస్తున్నారు.

Tags:    

Similar News