జగన్ పై నవీన్ ప్రశంసలు

దిశ చట్టం దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోందని స్పీకర్ తమ్మినేని సీతారాం తెలిపారు. ఇప్పటికే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దిశ చట్టం కాపీలను తమకు పంపించాలని కోరారన్నారు. [more]

Update: 2019-12-17 03:46 GMT

దిశ చట్టం దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోందని స్పీకర్ తమ్మినేని సీతారాం తెలిపారు. ఇప్పటికే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దిశ చట్టం కాపీలను తమకు పంపించాలని కోరారన్నారు. జగన్ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారని స్పీకర్ తమ్మినేని సీతారాం తెలిపారు. తాజాగా ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కూడా దిశ చట్టాన్ని ప్రశంసించారన్నారు. తాము కూడా దిశ చట్టాన్ని ఒడిశాలో యదతధంగా అమలు చేస్తామని ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ లేఖ రాసినట్లు స్పీకర్ తమ్మినేని వెల్లడించారు. డైనమిక్ సీఎం జగన్ సారథ్యంలో ఏపీ ముందుకు సాగాలని నవీన్ పట్నాయక్ కోరుకున్నారని స్పీకర్ వెల్లడించారు. దిశ చట్టం ప్రతులను పంపాలని ఒడిశా ప్రభుత్వం కోరిందని తెలిపారు.

Tags:    

Similar News