కేసుల సంఖ్యతో పాటు మరణాలు కూడా?

భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కరోనా వైరస్ మాత్రం నియంత్రణలోకి రావడం లేదు. తాజాగా 24 గంటల్లో [more]

Update: 2020-06-08 06:11 GMT

భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కరోనా వైరస్ మాత్రం నియంత్రణలోకి రావడం లేదు. తాజాగా 24 గంటల్లో దేశంలో 9,983 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులోనే 206 మంది మరణించారు. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా కరోనా కారణంగా 7,135 మంది మృతి చెందారు. ఇప్పటి వరకూ భారత్ లో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 2,56,611కు చేరుకుంది. లక్షా ఇరవై ఐదు వేల యాక్టివ్ కేసులు భారత్ లో ఉన్నాయి. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

Tags:    

Similar News