భారత్ లో తగ్గుముఖం పట్టిన కరోనా

భారత్ లో కరోనా కేసుల సంఖ్య తగ్గు ముఖం పట్టింది. తాజాగా భారత్ లో 3,29,942 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 3,876 మంది కరోనాతో మరణించారు. [more]

Update: 2021-05-11 05:51 GMT

భారత్ లో కరోనా కేసుల సంఖ్య తగ్గు ముఖం పట్టింది. తాజాగా భారత్ లో 3,29,942 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 3,876 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,29,92,517 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో 2,49,992 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 37,15,221 గా ఉంది. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 1,90,27,304 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

Tags:    

Similar News