నేడు తిరుపతి ఉప ఎన్నికకు నోటిఫికేషన్

నేడు తిరుపతి పార్లమెంటు నియోజకవర్గానికి నోటిఫికేషన్ వెలువడనుంది. నేటి నుంచి నామినేషన్లను వేసే అవకాశం ఉంటుంది. ఈ నెల 30వ తేదీ వరకూ నామినేషన్లు వేయడానికి వీలుంది. [more]

Update: 2021-03-23 00:54 GMT

నేడు తిరుపతి పార్లమెంటు నియోజకవర్గానికి నోటిఫికేషన్ వెలువడనుంది. నేటి నుంచి నామినేషన్లను వేసే అవకాశం ఉంటుంది. ఈ నెల 30వ తేదీ వరకూ నామినేషన్లు వేయడానికి వీలుంది. వచ్చే నెల 17వ తేదీన తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక జరగనుంది. ఈ నెల 24వ తేదీన టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి నామినేషన్ వేయనున్నారు. వైసీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి నామినేషన్ తేదీ ఖరారు కాలేదు. బీజేపీ ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. నేడు నోటిఫికేషన్ విడుదల కానుండటంతో ఇక రాజకీయ పార్టీలు ప్రచారంపై దృష్టి పెట్టనున్నాయి.

Tags:    

Similar News