Andhra ; నేడు నామినేషన్లకు చివరి గడువు… ఖరారు కాని పొత్తులు

ఆంధ్రప్రదేశ్ లో నేడు నామినేషన్లకు తుదిగడువు. పన్నెండు మున్సిపాలిటీలు, నెల్లూరు కార్పొరేషన్లతో పాటు ఖాళీ గా ఉన్న వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నెల 15వ తేదీన [more]

Update: 2021-11-05 06:45 GMT

ఆంధ్రప్రదేశ్ లో నేడు నామినేషన్లకు తుదిగడువు. పన్నెండు మున్సిపాలిటీలు, నెల్లూరు కార్పొరేషన్లతో పాటు ఖాళీ గా ఉన్న వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నెల 15వ తేదీన ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నేడు నామినేషన్ల దాఖలుకు చివరిగడువుగా ప్రకటించారు. అయితే నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ లో ఇంత వరకూ పొత్తులు కుదరలేదు. వైసీపీ ఇప్పటికే అభ్యర్థుల జాబితాను ప్రకటించింది.

ఖరారు కాని పొత్తులు….

టీడీపీ ఇంకా అభ్యర్థుల జాబితాను ప్రకటించలేదు. కమ్యునిస్టు పార్టీలతో కలసి టీడీపీ ఇక్కడ పోటీ చేయనుంది. అలాగే బీజేపీ, జనసేన పార్టీల మధ్య పొత్తు కుదరలేదు. సాయంత్రానికి నామినేషన్ల గడువు ముగుస్తున్నా ఇంకా పొత్తులు ఖరారు కాలేదు.

Tags:    

Similar News