ఇప్పుడయితే కష్టమే.. స్పష్టం చేసిన నీలం సాహ్ని

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నితో భేటీ అయ్యారు. అయితే ఇప్పటికే అనేక మంది ప్రభుత్వ ఉద్యోగులు [more]

Update: 2020-10-28 13:02 GMT

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నితో భేటీ అయ్యారు. అయితే ఇప్పటికే అనేక మంది ప్రభుత్వ ఉద్యోగులు కరోనా బారిన పడ్డారని నీలం సాహ్ని లెక్కలతో సహా వివరించినట్లు తెలుస్తోంది. పోలీసు శాఖలో కూడా అనేక మంది వైరస్ బారిన పడ్డారని నీలం సాహ్ని నిమ్మగడ్డ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల నిర్వహణ కష్టమనే భావనను నీలం సాహ్ని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కరోనా కేసులు కూడా ఇంకా తగ్గుముఖం పట్టలేదని, రోజుకు రాష్ట్రంలో తొమ్మిదివేలకు పైగా కేసులు నమోదవుతున్న విషయాన్ని కూడా నీలం సాహ్ని నిమ్మగడ్డ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. కరోనా పరిస్థితులు కుదుటపడగానే తాము ఎన్నికల కమిషనర్ ను సంప్రదిస్తామని నీలం సాహ్ని చెప్పారని సమాచారం.

Tags:    

Similar News