గవర్నర్ కు నిమ్మగడ్డ లేఖ

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కు రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖ రాశారు. స్థానిక ఎన్నికల నిర్వహణపై అసెంబ్లీ తీర్మానం చేయడాన్ని ఆయన [more]

Update: 2020-12-05 09:41 GMT

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కు రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖ రాశారు. స్థానిక ఎన్నికల నిర్వహణపై అసెంబ్లీ తీర్మానం చేయడాన్ని ఆయన ఆక్షేపించారు. అది రాజ్యాంగ విరుద్ధమని నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ కు స్వయంప్రతిపత్తి ఉంటుందని, ఐదేళ్లకొకసారి ఎన్నికలు జరపడం ఎన్నికల కమిషనర్ విధి అని నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆ లేఖలో పేర్కొన్నారు. అసెంబ్లీ తీర్మానానికి సంబంధించిన ఆర్డినెన్స్ వస్తే తిరస్కరించమని నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్ ను కోరారు. దీనిపై సుప్రీంకోర్టు న్యాయనిపుణులను కూడా సంప్రదించవచ్చని సూచించారు.

Tags:    

Similar News