సెలవుపై వెళ్లాలనుకున్న నిమ్మగడ్డకు….?

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు జారీ చేశారు. ప్రివిలేజ్ కమిటీ ఆదేశాల మేరకు ఆయన నిన్న నోటీసులు నిమ్మగడ్డ [more]

Update: 2021-03-19 00:44 GMT

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు జారీ చేశారు. ప్రివిలేజ్ కమిటీ ఆదేశాల మేరకు ఆయన నిన్న నోటీసులు నిమ్మగడ్డ కు అందజేశారు. విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులో పేర్కొన్నారు. విచారణకు ఎప్పుడు హాజరవ్వాలన్నది చెప్పలేదు. అయితే ప్రివిలేజ్ కమిటీకి అందుబాటులో ఉండాలని మాత్రం నోటీసుల్లో పేర్కొన్నారు. దీంతో సెలవుపై వెళ్లాలనుకున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు నోటీసులు అడ్డంకిగా మారాయి.

Tags:    

Similar News