మరో కీలక నిర్ణయం తీసుకున్న నిమ్మగడ్డ

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఏకగ్రీవమయిన 11 చోట్ల తిరిగి నామినేషన్ వేసుకునేందుకు అవకాశమిచ్చారు. ఇక్కడ [more]

Update: 2021-03-02 00:43 GMT

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఏకగ్రీవమయిన 11 చోట్ల తిరిగి నామినేషన్ వేసుకునేందుకు అవకాశమిచ్చారు. ఇక్కడ బలవంతంగా ఏకగ్రీవం చేయించుకున్నారని అభిప్రాయపడి నామినేషన్ కు అవకాశమిచ్చామని నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. ఈ మేరకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. తిరుపతి కార్పొరేషన్ పరిధిలో ఆరు చోట్ల, పుంగనూరు మున్సిపాలిటీ పరిధిలో మూడు వార్డులు, రాయచోటి మున్సిపాలిటిలీో రెండు చోట్ల నామినేషన్ తిరిగి వేసుకునేందుకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ అవకాశమిచ్చారు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటల లోపు వారు నామినేషన్ వేసుకోవచ్చు. అయితే గెలిచిన అభ్యర్థులు దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నారు.

Tags:    

Similar News