నిమ్మగడ్డ పిటీషన్ పై నేడు విచారణ

రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పిటీషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. తనను ఎస్ఈసీ పదవి నుంచి తప్పించడంపై నిమ్మగడ్డ రమేష్ [more]

Update: 2020-04-20 02:06 GMT

రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పిటీషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. తనను ఎస్ఈసీ పదవి నుంచి తప్పించడంపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే. నిమ్మగడ్డ రమేష్ కుమార్ తో పాటు మరి కొందరు ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. బీజేపీ నుంచి కామినేని శ్రీనివాస్, టీడీపీ నుంచి వర్ల రామయ్య, కాంగ్రెస్ నుంచి మస్తాన్ వలిలు నిమ్మగడ్డ తొలగింపు అన్యాయమంటూ పిటషన్లు దాఖలు చేశారు. ప్రభుత్వం కూడా గత శనివారం కౌంటర్ దాఖలు చేసింది. దీనిపై నేడు విచారణ జరగనుంది.

Tags:    

Similar News