రాజ్ భవన్ కు పాకిన కరోనా

ఆంధ్రప్రదేశ్ రాజ్ భవన్ లో పనిచేస్తున్న ఒకరికి కరోనా సోకింది. దీంతో ప్రభుత్వం అప్రమత్తమయింది. రాజ్ భవన్ లో స్టాఫ్ నర్సుగా పనిచేస్తున్న ఒక యువతికి కరోనా [more]

Update: 2020-04-27 02:46 GMT

ఆంధ్రప్రదేశ్ రాజ్ భవన్ లో పనిచేస్తున్న ఒకరికి కరోనా సోకింది. దీంతో ప్రభుత్వం అప్రమత్తమయింది. రాజ్ భవన్ లో స్టాఫ్ నర్సుగా పనిచేస్తున్న ఒక యువతికి కరోనా పాజిటివ్ రావడంతో ఆమెను వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్చించారు. దీంతో రాజ్ భవన్ లో ఉన్న ఉద్యోగులందరికీ కరోనా టెస్ట్ లు నిర్వహించాలని నిర్ణయించారు. కరోనా పాజిటివ్ సోకిన మహిళ గవర్నర్ వైద్య బృందంలో ఒకరు. దీంతో అందరికీ కరోనా టెస్ట్ లను నిర్వహించి క్వారంటైన్ కు తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Tags:    

Similar News