టీడీపీ పోయింది… టెన్ష‌న్లూ పోయాయి

తాము అధికారంలోకి వ‌చ్చాక నూటికి నూరు శాతం ప్ర‌జ‌ల కోసం ప‌నిచేశామ‌ని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ పేర్కొన్నారు. బుధ‌వారం ఆయ‌న 16వ లోక్‌స‌భ స‌మావేశాల చివ‌రి రోజు [more]

Update: 2019-02-13 12:09 GMT

తాము అధికారంలోకి వ‌చ్చాక నూటికి నూరు శాతం ప్ర‌జ‌ల కోసం ప‌నిచేశామ‌ని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ పేర్కొన్నారు. బుధ‌వారం ఆయ‌న 16వ లోక్‌స‌భ స‌మావేశాల చివ‌రి రోజు ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ… మూడు ద‌శాబ‌ద్దాల త‌ర్వాత పూర్తి మెజారిటీతో తాము అధికారంలోకి వ‌చ్చామ‌న్నారు. ఈ పార్ల‌మెంటులోనే ఎక్కువ మంది మ‌హిళా స‌భ్యులు ఉన్నారని, ఇద్ద‌రు మ‌హిళ‌ల‌కు కీల‌క‌ మంత్రి ప‌ద‌వులు ఇచ్చామ‌ని గుర్తు చేశారు. నేడు దేశంలో ఆత్మ‌విశ్వాసంతో ముందుకుపోతోంది, ఎక్కువ శాటిలైట్ల‌ను అంత‌రిక్షానికి పంపించామ‌ని పేర్కొన్నారు. మాన‌వీయ‌కోణంలో ప‌లు దేశాల‌కు స‌హాయ‌ప‌డ్డామని తెలిపారు. అవినీతిని నిర్మూలించేందుకు ప‌లు కొత్త చ‌ట్టాలు తీసుకువ‌చ్చామ‌ని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ త‌మ‌ను విడిచిపోయింద‌ని, టీడీపీతో పాటే త‌మ‌కు టెన్ష‌న్లు కూడా పోయాయ‌న్నారు.

Tags:    

Similar News