బ్రేకింగ్ : గుంటూరు జిల్లా టీడీపీ నేతపై కేసు నమోదు

గుంటూరు జిల్లా టీడీపీ నేత నరేంద్ర వర్మపై పోలీసులు కేసు నమోదు చేశారు. నరేంద్ర వర్మ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం చేశారు. దీంతో నరేంద్ర వర్మతో పాటు ఆయన [more]

Update: 2020-07-15 04:26 GMT

గుంటూరు జిల్లా టీడీపీ నేత నరేంద్ర వర్మపై పోలీసులు కేసు నమోదు చేశారు. నరేంద్ర వర్మ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం చేశారు. దీంతో నరేంద్ర వర్మతో పాటు ఆయన అనుచరులు ముగ్గురిపై కేసు నమోదు చేశారు. నరేంద్ర వర్మ డ్రైవర్ వీరేష్ కు గత ప్రభుత్వ హయాంలో బాపట్లలో నాలుగు సెంట్ల స్థలాన్ని ఇచ్చారు. వీరేష్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు. అయితే ప్రస్తుతం ఆ స్థలం తిరిగి ఇచ్చేయాలని వీరేష్ పై నరేంద్ర వర్మ అనుచరులు వత్తిడి తెచ్చారు. దీంతో వీరేష్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. నరేంద్ర వర్మ ప్రస్తుతం బాపట్ల టీడీపీ ఇన్ ఛార్జిగా ఉన్నారు.

Tags:    

Similar News