పవన్ కల్యాణ్ పై నారాయణ ధ్వజం

బీజేపీతో పవన్ కల్యాణ్ కలసి రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కల్గిస్తున్నారని సీపీఐ నేత నారాయణ తెలిపారు. బీజేపీ, జనసేనలకు ఓటు వేస్తే అది వృధా అవుతుందని నారాయణ [more]

Update: 2021-03-03 00:52 GMT

బీజేపీతో పవన్ కల్యాణ్ కలసి రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కల్గిస్తున్నారని సీపీఐ నేత నారాయణ తెలిపారు. బీజేపీ, జనసేనలకు ఓటు వేస్తే అది వృధా అవుతుందని నారాయణ పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ తుడిచిపెట్టుకుపోతుందని నారాయణ జోస్యం చెప్పారు. వివిధ వర్గాలకు చెందిన నాయకులతో బీజేపీ నేతలు చీకటి ఒప్పందం చేసుకుంటున్నారని నారాయణ ఆరోపించారు. విష్ణువర్థన్ రెడ్డి ముప్ఫయి కోట్లు వసూళ్లకు పాల్పడ్డారన్నారు. పవన్ కల్యాణ్ ఇప్పటికైనా బీజేపీ తో చెలిమి నుంచి బయటకు రావాలని నారాయణ కోరారు.

Tags:    

Similar News