అమ్మేస్తున్నా.. మాట్లాడరా?

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కేంద్రప్రభుత్వం అమ్మడానికి రెడీ అవుతున్నా ఏపీ ముఖ్యమంత్రి జగన్ మౌనం వీడటం లేదని నారా లోకేష్ అన్నారు. పోరాడి సాధించుకున్న స్టీల్ ప్లాంట్ [more]

Update: 2021-02-06 00:57 GMT

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కేంద్రప్రభుత్వం అమ్మడానికి రెడీ అవుతున్నా ఏపీ ముఖ్యమంత్రి జగన్ మౌనం వీడటం లేదని నారా లోకేష్ అన్నారు. పోరాడి సాధించుకున్న స్టీల్ ప్లాంట్ ను జగన్ తన స్వార్థం కోసం తాకట్టు పెట్టారని లోకేష్ ధ్వజమెత్తారు. స్టీల్ ప్లాంట్ ను అమ్మేస్తామని లోక్ సభలో చెబుతున్నా వైసీపీ ఎంపీలు ఎందుకు మాట్లాడలేదని లోకేష్ ప్రశ్నించారు. ఈ మేరకు జగన్ కు నారా లోకేష్ లేఖ రాశారు. ఛత్తీస్ ఘడ్ లో లాగా విశాఖ స్టీల్ ప్లాంట్ ను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని లోకేష్ జగన్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు.

Tags:    

Similar News