బదులుకు బదులు తీర్చుకుంటాం

తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులపై జరిగిన ప్రతి దాడికి మూల్యం చెల్లించుకోక తప్పదని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ హెచ్చరించారు. వైసీపీ పాలనలో అరాచకాలు పెరిగిపోతున్నాయన్నారు. [more]

Update: 2021-06-15 03:08 GMT

తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులపై జరిగిన ప్రతి దాడికి మూల్యం చెల్లించుకోక తప్పదని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ హెచ్చరించారు. వైసీపీ పాలనలో అరాచకాలు పెరిగిపోతున్నాయన్నారు. రెండేళ్ల పాలనలో దాడులు తప్ప అభివృద్ధి ఏమీ లేదని లోకేష్ విమర్శించారు. కొత్తగా ఎన్నికైన సర్పంచ్ లు అభివృద్ధి పనులు ప్రారంభించాలనుకుంటే వైసీపీ నేతలు అడ్డుకుంటున్నారన్నారు. అమరావతి మండలం ఉంగుటూరు సర్పంచ్ అనురాధ కుటుంబీకులపై వైసీపీ నేతలు దాడి చేయడాన్ని లోకేష్ ఖండించారు. దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు.

Tags:    

Similar News